గృహదహనం కేసులో నిందితుల అరెస్టు
ABN , First Publish Date - 2021-04-13T03:47:50+05:30 IST
మండలంలోని లేగుంటపాడులో ఓ మహిళ ఇంటిని ఈ నెల 8న తగులబబెట్టిన కేసులో నిందితులను సోమవారం అరెస్టు చేసినట్లు సీఐ
కోవూరు, ఏప్రిల్12 : మండలంలోని లేగుంటపాడులో ఓ మహిళ ఇంటిని ఈ నెల 8న తగులబబెట్టిన కేసులో నిందితులను సోమవారం అరెస్టు చేసినట్లు సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాల మేరకు, లేగుంటపాడుకి చెందిన ఓ గిరిజన మహిళ ఈనెల 8న జొన్నవాడలో మొక్కుతీర్చుకొనేందుకు వెళ్లింది. ఆ విషయాన్ని తెలిసికున్న గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోలు పోసి ఇంటిని తగులబెట్టారు. ఇంటి పక్కనే నివాసమున్న షేక్ చోటు అనే వ్యక్తి ఈ విషయాన్ని ఆమెకు ఫోన్లో తెలిపాడు. మరుసటి దినం ఆమె కోవూరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ కృష్ణారెడ్డి కేసు దర్యాప్తు చేపట్టారు. కోవూరు దళితవాడకు చెందిన ఇస్రాయిల్ మార్క్మార్సన్, మైలా సునీల్ను నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. నిందితులను గుర్తించి అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరచిన ఎస్ఐ కృష్ణారెడ్డి, కానిస్టేబుళ్లు ఏ వెంకటేశ్వర్లు, ఇస్మాయిల్, జగదీష్, ఎస్ వెంకటేశ్వర్లు, ఎం చంద్రశేఖర్, సైఫుల్లా, టీ వేణులను ఆయన అభినందించారు. ఎస్పీ నుంచి రివార్డుల కోసం సిఫార్సు చేశారు.
-----------