నిమ్స్‌ ఆస్పత్రిలో వార్డ్‌ బాయ్‌ అదృశ్యం

ABN , First Publish Date - 2021-05-14T18:29:01+05:30 IST

అనుమానాస్పద స్థితిలో నిమ్స్‌ ఆస్పత్రిలో వార్డుబాయ్‌గా

నిమ్స్‌ ఆస్పత్రిలో వార్డ్‌ బాయ్‌ అదృశ్యం

హైదరాబాద్/పంజాగుట్ట : అనుమానాస్పద స్థితిలో నిమ్స్‌ ఆస్పత్రిలో వార్డుబాయ్‌గా పనిచేస్తున్న వ్యక్తి అదృశ్యమయ్యాడు. సంగారెడ్డి జిల్లాకు చెందిన బి.శ్రీనివాస్‌ (32) నిమ్స్‌ ఆస్పత్రిలో వార్డుబాయ్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలం క్రితం అదే జిల్లాకు చెందిన యువతితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొద్దికాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో శ్రీనివాస్‌ ఒక్కడే పంజాగుట్ట మార్కెట్‌ బస్తీలో రూమ్‌ అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. రోజూ నిమ్స్‌ ఆస్పత్రికి విధుల కు వెళ్లేవాడు. ఈ నెల 7న శ్రీనివాస్‌ మామ భుజంగం ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. తెలిసిన చోట వెతికినా ఆచూకీ లభించకపోవడంతో భుజంగం గురువారం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-05-14T18:29:01+05:30 IST