నిమ్స్లో నిలిచిపోయిన ఓపీ సేవలు
ABN , First Publish Date - 2021-05-06T14:46:57+05:30 IST
నిమ్స్లోని పాత బిల్డింగ్లోని అవుట్ పేషెంట్ బ్లాక్
- ఇంటర్నెట్ ఆగిపోవడమే కారణం
హైదరాబాద్/బేగంపేట : మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం వరకు నిమ్స్లోని పాత బిల్డింగ్లోని అవుట్ పేషెంట్ బ్లాక్, మిలీనియం బ్లాక్లో ఇంటర్నెట్ పని చేయలేదు. దీంతో ఓపీ సేవలు నిలిచిపోయి రోగులు అవస్థలు పడ్డారు. స్పెషాల్టీ బ్లాక్ వద్ద విపరీతమైన రద్దీ ఏర్పడింది. అసలే కరోనా పొంచి ఉండడంతో ఓపీ సేవల కోసం వచ్చిన వారు అల్లాడిపోయారు.