Hyderabad: ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దు : గవర్నర్

ABN , First Publish Date - 2022-09-04T17:46:34+05:30 IST

నిమ్స్ ఆస్పత్రిలో(NIMS Hospital) ఆదివారం గవర్నర్ తమిళిసై(Governor Tamilisai) పర్యటించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్

Hyderabad: ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దు : గవర్నర్

Hyderabad: నిమ్స్ ఆస్పత్రిలో(NIMS Hospital) ఆదివారం గవర్నర్ తమిళిసై(Governor Tamilisai) పర్యటించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్(Family planning operation) బాధితులను గవర్నర్ పరామర్శించారు. అనంతరం బాధితులకు ఒక్కొక్కరికి రూ.10వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్బంగా గవర్నర్ మాట్లాడుతూ.. నిమ్స్‌లో ట్రిట్‌మెంట్‌పై బాధితులు సంతృప్తిగా ఉన్నారని అన్నారు. నలుగురు మృతిచెందడం మామూలు విషయం కాదని, దీనిపై విచారణ జరుగుతోంది.. నివేదిక వచ్చాక కారణాలు తెలుస్తాయని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు హెచ్చరించారు. త్వరగా ఎక్కువ ఆపరేషన్లు చేయాలన్న టార్గెట్‌తో ప్రజల ప్రాణాలతో ఆడుకోకూడదని తెలిపారు. ఇన్ఫెక్షన్ల వల్ల మృతిచెందారని భావిస్తున్నట్లు గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు.

Updated Date - 2022-09-04T17:46:34+05:30 IST