హైదరాబాద్ నిమ్స్లో కరోనా కలకలం
ABN , First Publish Date - 2020-06-07T02:57:51+05:30 IST
నిమ్స్లో కరోనా కలకలం రేగింది. నిమ్స్లో పలువురు వైద్యులు, సిబ్బందికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆదివారం నుంచి 3 రోజుల పాటు..
హైదరాబాద్: నిమ్స్లో కరోనా కలకలం రేగింది. నిమ్స్లో పలువురు వైద్యులు, సిబ్బందికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆదివారం నుంచి 3 రోజుల పాటు నిమ్స్లోని 5 విభాగాలను మూసివేసే అవకాశం ఉంది. ఐదు విభాగాలను పూర్తిగా శానిటైజ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. నిమ్స్లో మూడు రోజుల పాటు మెడ్ గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, యూరాలజీ, కార్డియాలజీ, సర్జికల్ ఆంకాలజీ మూతపడనున్నాయి.