ఇప్పుడెందుకు స్పందిస్తున్నారు: నిమ్మల
ABN , First Publish Date - 2022-07-20T02:30:19+05:30 IST
గోదావరి వరదల్లో చిక్కుకున్నవారికి సాయం అందించలేక, ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకే పోలవరం ఎత్తుపై తెలంగాణ మిత్రులతో కలిసి కొత్త ఏపీ మంత్రులు ...
అమరావతి: గోదావరి వరదల్లో చిక్కుకున్నవారికి సాయం అందించలేక, ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకే పోలవరం ఎత్తుపై తెలంగాణ మిత్రులతో కలిసి కొత్త ఏపీ మంత్రులు కొత్త నాటకానికి తెరలేపారని టీడీపీ నేత నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో లేని పోలవరం ఎత్తుపై రగడ జగన్ ప్రభుత్వంలోనే ఎందుకొచ్చింది?, పోలవరం ఎత్తుపై కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కనీసం స్పందించని ఏపీ మంత్రులు ఇప్పుడెందుకు స్పందిస్తున్నారు? అని టీడీపీ శాసనసభాపక్ష నేత నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు.