దోచుకోవడమే పనిగా వైసీపీ పనిచేస్తుంది: చినరాజప్ప
ABN , First Publish Date - 2021-10-18T20:57:20+05:30 IST
ఈ నెల 20న లోకేష్ పర్యటన ఉందని, అనకాపల్లిలో, పార్టీ కార్యాలయం ప్రారంభం సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు టీడీపీ నేత చినరాజప్ప తెలిపారు.
అమరావతి: ఈ నెల 20న లోకేష్ పర్యటన ఉందని, అనకాపల్లిలో, పార్టీ కార్యాలయం ప్రారంభం సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు టీడీపీ నేత చినరాజప్ప తెలిపారు. త్వరలోనే ఉత్తరాంధ్ర సమస్యల పైన సమావేశం అయ్యన్నపాత్రుడు, ఆధ్వర్యంలో నిర్వహిస్తామని చెప్పారు. ఈనెల 26వ తేదీన విద్యుత్ పై నిరసన కార్యక్రమం చేపడతామన్నారు. ఉత్తరాంధ్రలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ భూములు దోచుకోవడమే పనిగా వైసీపీ పనిచేస్తుందని మండిపడ్డారు.