నిమ్మగడ్డ రామకృష్ణ, వేణుగోపాల్, విశ్వనాథ్ ఆస్తులు ఈడీ అటాచ్
ABN , First Publish Date - 2020-10-22T01:46:08+05:30 IST
నిమ్మగడ్డ రామకృష్ణ, వేణుగోపాల్, విశ్వనాథ్ ఆస్తులు ఈడీ అటాచ్
హైదరాబాద్: వీనస్ ఆక్వా ఫుడ్స్ లిమిటెడ్ డైరెక్టర్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. నిమ్మగడ్డ రామకృష్ణ, నిమ్మగడ్డ వేణుగోపాల్, విశ్వనాథ్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. హైదరాబాద్, విజయవాడలో రూ.33.39 కోట్ల ఆస్తులు జప్తు చేసింది. గుడివాడ ఆంధ్రాబ్యాంక్ నుంచి రూ.36.97 కోట్ల రుణం తీసుకొని మోసం చేసినట్లు వీనస్ ఆక్వా ఫుడ్స్పై అభియోగం మోపారు. చేపల చెరువుల కోసం రుణం తీసుకొని, ఇతర వ్యాపారాలకు మళ్లించినట్లు దర్యాప్తులో అధికారులు వెల్లడించారు. రూ.1.72 కోట్లు సినిమా నిర్మాణం కోసం మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. నిందితులు బ్యాంక్ రుణంతో పాటు కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువుల నుంచి చేపల చెరువు పేరుతో రూ. 22.64 కోట్లు రుణాలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.