నిఖత్‌ పసిడి పంచ్‌

ABN , First Publish Date - 2021-10-28T09:09:41+05:30 IST

తెలుగమ్మాయి నిఖత్‌ జరీన్‌ అంచనాలకు తగ్గట్టు రాణించి పసిడి పంచ్‌ విసిరింది.......

నిఖత్‌ పసిడి పంచ్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): తెలుగమ్మాయి నిఖత్‌ జరీన్‌ అంచనాలకు తగ్గట్టు రాణించి పసిడి పంచ్‌ విసిరింది. హరియాణాలోని హిస్సార్‌లో వారం రోజులుగా జరుగుతున్న జాతీయ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌ప బుధవారం ముగిసింది. ఈ పోటీల 52 కిలోల విభాగం ఫైనల్లో నిఖత్‌ 4-1తో మీనాక్షి (హరియాణా)పై నెగ్గి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది.   ఈ గెలుపుతో నిఖత్‌ డిసెంబరులో టర్కీలో జరగనున్న మహిళల వరల్డ్‌ చాంపియన్‌షిప్‌కు బెర్త్‌ను ఖాయం చేసుకొంది.

Updated Date - 2021-10-28T09:09:41+05:30 IST