ప్రపంచ మహిళా బాక్సింగ్‌ పోటీలో సెమీఫైనల్‌కు నిఖత్‌ జరీనా

ABN , First Publish Date - 2022-05-17T06:03:20+05:30 IST

ప్రపంచ మహిళా బాక్సింగ్‌ పోటీలో జిల్లాకు చెందిన బాక్సర్‌ విజయపరంపర కొన సాగుతోంది. నిఖత్‌ జరీనా అలవోకగా విజయాలు సాధి స్తూ సెమీఫైనల్‌కు చేరుకుంది. సోమవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌కు చెందిన చార్లీ డెవిసన్‌తో 52 కేజీల విభాగంలో తలపడి సెమీఫైనల్‌కు చేరుకుంది.

ప్రపంచ మహిళా బాక్సింగ్‌ పోటీలో సెమీఫైనల్‌కు నిఖత్‌ జరీనా

సుబాష్‌నగర్‌, మే16:  ప్రపంచ మహిళా బాక్సింగ్‌ పోటీలో జిల్లాకు చెందిన బాక్సర్‌ విజయపరంపర కొన సాగుతోంది. నిఖత్‌ జరీనా అలవోకగా విజయాలు సాధి స్తూ సెమీఫైనల్‌కు చేరుకుంది. సోమవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌కు చెందిన చార్లీ డెవిసన్‌తో 52 కేజీల విభాగంలో తలపడి సెమీఫైనల్‌కు చేరుకుంది. మరో రెండు విజయాలు సాధించి ప్రపంచ ఛాంపియన్‌గా నిలవాలని జిల్లా క్రీడాభిమానులు కోరు కుంటున్నారు. సెమీ ఫైనల్‌కు చేరుకోవడం పట్ల జిల్లా బాక్సింగ్‌ అసోసియేషన్‌ సభ్యులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-05-17T06:03:20+05:30 IST