ప్రపంచ మహిళా బాక్సింగ్లో క్వార్టర్ ఫైనల్కు చేరిన నిఖత్ జరీనా
ABN , First Publish Date - 2022-05-16T06:26:32+05:30 IST
ప్రపంచ మహిళా బాక్సింగ్ పోటీలో జిల్లాకు చెందిన బాక్సర్ విజయపరంపర కొనసాగుతోంది. నిఖత్ జరీనా అల వోకగా విజయాలు సాధిస్తూ క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. ఆదివారం 52 కేజీల విభాగంలో మంగోళియా దేశ క్రీడాకారిణి అట్లాన్సెక్పై 5-0తో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది.
సుబాష్నగర్ మే 15: ప్రపంచ మహిళా బాక్సింగ్ పోటీలో జిల్లాకు చెందిన బాక్సర్ విజయపరంపర కొనసాగుతోంది. నిఖత్ జరీనా అల వోకగా విజయాలు సాధిస్తూ క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. ఆదివారం 52 కేజీల విభాగంలో మంగోళియా దేశ క్రీడాకారిణి అట్లాన్సెక్పై 5-0తో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. సోమవారం క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లాండ్కు చెందిన చార్లీ డెవిసన్తో తలపడనుంది. క్వార్టర్ ఫైనల్కు చేరుకోవడం పట్ల జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ సభ్యులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.