వావ్.. నిఖత్
ABN , First Publish Date - 2022-05-17T09:37:22+05:30 IST
తెలుగమ్మాయి నిఖత్ జరీన్ ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్షి్పలో సత్తా చాటుతోంది.
సెమీస్ చేరిన తెలుగు బాక్సర్
ప్రపంచ చాంపియన్షిప్లో పతకం ఖాయం
న్యూఢిల్లీ: తెలుగమ్మాయి నిఖత్ జరీన్ ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్షి్పలో సత్తా చాటుతోంది. టర్కీలోని ఇస్తాంబుల్లో సోమవారం జరిగిన 52 కిలోల విభాగం బౌట్లో నిఖత్ సెమీఫైనల్కు దూసుకెళ్లి పతకాన్ని ఖాయం చేసుకుంది. నిఖత్తో పాటు మరో ఇద్దరు భారత బాక్సర్లు మనీషా (57 కిలోలు), పర్వీన్ (63 కిలోలు) సెమీ్సలో ప్రవేశించి పతకాలను ఖాతాలో వేసుకున్నారు. క్వార్టర్స్ బౌట్లో నిజామాబాద్ అమ్మాయి నిఖత్ 5-0తో చార్లీ సియాన్ (ఇంగ్లండ్)ను చిత్తుగా ఓడించింది. మరో బౌట్లో పర్వీన్ 5-0తో జుల్కనరోవా (తజకిస్థాన్)పై, మనీషా 4-1తో మోన్ఖోర్ (మంగోలియా)పై విజయం సాధించారు. 25 ఏళ్ల నిఖత్ ఫైనల్ బెర్త్ కోసం కరోలిన్ డీ అల్మిదా (బ్రెజిల్)తో అమీతుమీ తేల్చుకోనుంది. సెమీస్లో ఓడినా కనీసం కాంస్యం దక్కుతుంది. మిగతా భారత బాక్సర్లలో నీతూ (48 కి), పూజా రాణి (81 కి) క్వార్టర్స్లో ఓడి ఇంటిబాట పట్టారు.