నిజం చెబితే ఉలిక్కిపడతావెందుకన్నా!

ABN , First Publish Date - 2021-03-07T05:30:00+05:30 IST

అన్నా నిజం మాట్లాడితే ఉలిక్కి పడతావు ఎందుకు ... మూడు నెలలకు ముందు నువ్వు చెప్పిందే నేను చెప్పా.. అంతమాత్రానికి బొక్కలో పెట్టిస్తానంటే ఎలా అంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎమ్మెల్యే ఆనం రామనారాయణపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు..

నిజం చెబితే ఉలిక్కిపడతావెందుకన్నా!
మాట్లాడుతున్న సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి

 పార్టీలు మారడం ఆనంకు తొలినుంచి అలవాటే 

 జగన్‌ను ఆనం తిట్టిన తిట్లు టీడీపీ వాళ్లుకూడా ఎప్పుడూ తిట్టలేదు

 మాజీ మంత్రి సోమిరెడ్డి 

వెంకటగిరి, మార్చి 7 : అన్నా నిజం మాట్లాడితే ఉలిక్కి పడతావు ఎందుకు ... మూడు నెలలకు ముందు నువ్వు చెప్పిందే నేను చెప్పా.. అంతమాత్రానికి బొక్కలో పెట్టిస్తానంటే ఎలా అంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎమ్మెల్యే ఆనం రామనారాయణపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.. ఆదివారం ఆయన వెంకటగిరిలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో ఎక్కడాలేని మాఫియాలు జిల్లాలో ఉన్నాయని, రెండేళ్లల్లో తాను వెంకటగిరి నియోజకవర్గంలో తట్టెడు మట్టి వేయలేకపోయానని, అసలు రాష్ట్రంలో వెంకటగిరి ఉందా అని నువ్వే కదన్నా ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ చెప్పావు! ఇవాళ వెంకటగిరిలో అభివృద్ధి జరగలేదని మేము చెబితే ఎందుకంత ఉలిక్కిపడతావు అంటూ సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆనం రామనారాయణరెడ్డికి దివంగత నేత ఎన్‌టిరామారావు రాజకీయ భిక్ష పెట్టారని, ఆయన చలువ వల్ల ఎమ్మెల్యే అయి మంత్రి పదవులు అనుభవించాక ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోగానే మళ్లీ కాంగ్రెస్‌ పార్టీలో చేరాడని విమర్శించారు. అక్కడ కూడా పదవులు అనుభవించి కాంగ్రెస్‌ పార్టీ అగ్రనాయకత్వం మెప్పుకోసం, జగన్‌మోహన్‌రెడ్డి నీచాతి నీచంగా తిట్టిన తర్వాత టీడీపీలో చేరాడన్నారు. జగన్‌ ముఖ్యమంత్రి అయిపోతాడని తెలుసుకుని వైసీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యాడన్నారు. నీలా రోజుకో పార్టీ, ఐదేళ్లకోసారి నియోజకవర్గాలు మార్చడం తమకు చేతకాదన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికై రెండేళ్లు కావస్తున్నా ఎలాంటి పనులు చేసుకోలేక పోతున్నాన్న డిప్రెషన్‌కు గురైన ఆనం సొంత పార్టీపై నోటికొచ్చినట్టు మాట్లాడి ఇవాళ రెండున్నరేళ్లు పూర్తి కావస్తుండంఅన్నా నిజం మాట్లాడితే ఉలిక్కి పడతావు ఎందుకు ... మూడు నెలలకు ముందు నువ్వు చెప్పిందే నేను చెప్పా.. అంతమాత్రానికి బొక్కలో పెట్టిస్తానంటే ఎలా అంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎమ్మెల్యే ఆనం రామనారాయణపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.. ఆదివారం ఆయన వెంకటగిరిలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో ఎక్కడాలేని మాఫియాలు జిల్లాలో ఉన్నాయని, రెండేళ్లల్లో తాను వెంకటగిరి నియోజకవర్గంలో తట్టెడు మట్టి వేయలేకపోయానని, అసలు రాష్ట్రంలో వెంకటగిరి ఉందా అని నువ్వే కదన్నా ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ చెప్పావు! ఇవాళ వెంకటగిరిలో అభివృద్ధి జరగలేదని మేము చెబితే ఎందుకంత ఉలిక్కిపడతావు అంటూ సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆనం రామనారాయణరెడ్డికి దివంగత నేత ఎన్‌టిరామారావు రాజకీయ భిక్ష పెట్టారని, ఆయన చలువ వల్ల ఎమ్మెల్యే అయి మంత్రి పదవులు అనుభవించాక ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోగానే మళ్లీ కాంగ్రెస్‌ పార్టీలో చేరాడని విమర్శించారు. అక్కడ కూడా పదవులు అనుభవించి కాంగ్రెస్‌ పార్టీ అగ్రనాయకత్వం మెప్పుకోసం, జగన్‌మోహన్‌రెడ్డి నీచాతి నీచంగా తిట్టిన తర్వాత టీడీపీలో చేరాడన్నారు.   జగన్‌ ముఖ్యమంత్రి అయిపోతాడని తెలుసుకుని వైసీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యాడన్నారు. నీలా రోజుకో పార్టీ, ఐదేళ్లకోసారి నియోజకవర్గాలు మార్చడం తమకు చేతకాదన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికై రెండేళ్లు కావస్తున్నా ఎలాంటి పనులు చేసుకోలేక పోతున్నాన్న డిప్రెషన్‌కు గురైన ఆనం సొంత పార్టీపై నోటికొచ్చినట్టు మాట్లాడి ఇవాళ రెండున్నరేళ్లు పూర్తి కావస్తుండంతో షిఫ్టు పద్ధతిలోనైనా మంత్రి పదవి రాకపోతుందా అన్న నమ్మకంతో జగన్‌పై ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తున్నాడని ఆరోపించారు. టీడీపీ సీనియర్‌ నాయకుడు పోలంరెడ్డి వెంకటరెడ్డిని వయస్సును కూడా చూడకుండా ఒక సీఐ పరుషపదజాలంతో దూషిస్తే, ఆ అధికారిని మందలించాల్సింది పోయి మమ్మల్ని బొక్కలో పెట్టిస్తానని మాట్లాడుతావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూకబ్జాదారులు, ఎర్రచందనం స్మగ్లర్లను పక్కన పెట్టుకుని ఎన్నికల ప్రచారానికి వెళితే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌, పార్టీ పరిశీలకులు బాలకృష్ణ చౌదరి, సురేంద్ర, నాయకులు పులికొల్లు రాజేశ్వరరావు, బీరం రాజేశ్వరరావు, గల్లా శ్రీనివాసులు, కేవీకే ప్రసాద్‌ నాయుడు, సీసీ నాయుడు, పోలంరెడ్డి కోటేశ్వరరెడ్డి, పునుగోటి విశ్వనాథం నాయుడు, ఆవుల ప్రహ్లాద, గంగాధర్‌, మధునాయుడు తదితరులు పాల్గొన్నారు

Updated Date - 2021-03-07T05:30:00+05:30 IST