ఏపీలో ఈనెల 21వరకు రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

ABN , First Publish Date - 2021-08-15T17:19:17+05:30 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూను పొడిగించారు.

ఏపీలో ఈనెల 21వరకు రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూను పొడిగించారు. ఈనెల 21వ తేదీ వరకు రాత్రి పూట కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ప్యూ అమల్లో ఉంటుంది. ఏపీలో కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు స్థిరంగా ఉంటున్నాయి. దీనిపై నిన్న ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. అనంతరం రాత్రి పూట కర్ఫ్యూ పొడిగించాలని ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఆదివారం జీవో జారీ చేసింది.

Updated Date - 2021-08-15T17:19:17+05:30 IST