ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు
ABN , First Publish Date - 2021-09-03T02:59:53+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం విధించిన రాత్రి పూట కర్ఫ్యూని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ప్రస్తుతం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు.
అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం విధించిన రాత్రి పూట కర్ఫ్యూని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ప్రస్తుతం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. ఈ మేరకు అధికారులు ఆదేశాలు జారీచేశారు. కర్ఫ్యూ సమయాల్లో నిబంధనలు పాటించని వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఏపీ ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా కేసులుతో మరణాలు కూడా తగ్గుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్లతో పాటు బౌతిక దూరం పాటించాలని అధికారులు చెబుతున్నారు.