దర్బంగా బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ చార్జ్షీట్లు దాఖలు
ABN , First Publish Date - 2021-12-24T00:43:42+05:30 IST
దర్బంగా బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ చార్జ్షీట్లను
హైదరాబాద్: దర్బంగా బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ చార్జ్షీట్లను దాఖలు చేసింది. ఐదుగురిపై అభియోగాలను ఎన్ఐఏ నమోదు చేసింది. నాసిర్ మాలిక్, ఇమ్రాన్ మాలిక్, సలీం అహ్మద్, కపిల్ అహ్మద్, ఇక్బల్పై అభియోగాలు నమోదు చేసింది. సికింద్రాబాద్ నుంచి దర్బంగా ఎక్స్ప్రెస్లో బాంబులు పార్సిల్ అయినట్లు తెలిపింది. బిహార్ దర్బంగా రైల్వే స్టేషన్లో పార్సిల్లో బాంబులు పేలాయి. మాలిక్ సోదరులు పేలుడుకు ముందు పాకిస్థాన్లో శిక్షణ తీసుకున్నారని పేర్కొంది. పేలుడు తర్వాత నేపాల్ మీదుగా పాకిస్తాన్ వెళ్లేందుకు కుట్ర పన్నారని ఆరోపించింది. నేపాల్ బొర్డర్లో ఇద్దరిని, హైదరాబాద్లో ఇద్దరిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.