శ్రీశైలంలో ఎన్‌హెచ్‌ఏఐ చైర్‌పర్సన్‌

ABN , First Publish Date - 2022-08-11T06:00:45+05:30 IST

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను బుధవారం ఎన్‌హెచ్‌ఏఐ చైర్‌పర్సన్‌ అల్కా ఉపాధ్యాయ దర్శించుకున్నారు.

శ్రీశైలంలో ఎన్‌హెచ్‌ఏఐ చైర్‌పర్సన్‌
ఆలయ ప్రాంగణంలో అల్కా ఉపాధ్యాయ, అధికారులు

శ్రీశైలం, ఆగస్టు 10: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను బుధవారం ఎన్‌హెచ్‌ఏఐ చైర్‌పర్సన్‌ అల్కా ఉపాధ్యాయ దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న ఆమెకు ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం అల్కా ఉపాధ్యాయ స్వామిఅమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో ఆమెకు వేదపండితులు వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. 

Updated Date - 2022-08-11T06:00:45+05:30 IST