హైదరాబాద్‌ శివార్లలో మైనింగ్ జోన్ల అక్రమాలపై చెన్నై ఎన్జీటీ విచారణ

ABN , First Publish Date - 2022-01-18T22:29:50+05:30 IST

నగర శివార్లలో మైనింగ్ జోన్ల అక్రమాలపై చెన్నై ఎన్జీటీ విచారించింది. తనిఖీలు చేయాలని రంగారెడ్డి, యాదాద్రి కలెక్టర్లకు ఎన్జీటీ ఆదేశించింది.

హైదరాబాద్‌ శివార్లలో మైనింగ్ జోన్ల అక్రమాలపై చెన్నై ఎన్జీటీ విచారణ

హైదరాబాద్‌: నగర శివార్లలో మైనింగ్ జోన్ల అక్రమాలపై చెన్నై ఎన్జీటీ విచారించింది. తనిఖీలు చేయాలని రంగారెడ్డి, యాదాద్రి కలెక్టర్లకు ఎన్జీటీ ఆదేశించింది. అలాగే అక్రమ మైనింగ్ బాధితుల పిటిషన్‌పై ఎన్జీటీ విచారించింది. కేంద్ర పర్యవరణ శాఖ, తెలంగాణ ప్రభుత్వం, టీపీసీబీ రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల కలెక్టర్లకు ఎన్జీటీ నోటీసులు జారీ చేసింది. అక్రమ తవ్వకాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఎన్టీటీ కోరింది. అక్రమ మైనింగ్‌ వల్ల పర్యావరణానికి కలిగిన హానిని అంచనా వేసేందుకు  ఎన్జీటీ ధర్మాసనం సంయుక్త కమిటీ ఏర్పాటు చేసింది. కమిటిలో కేంద్ర పర్యవరణ శాఖ, తెలంగాణ మైనింగ్ శాఖ, టీపీసీబీ, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల కలెక్టర్లు ఉన్నారు. ఫిబ్రవరి 28 వరకు నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది. 

Updated Date - 2022-01-18T22:29:50+05:30 IST