ఎన్జీటీలో AP ప్రభుత్వానికి షాక్‌

ABN , First Publish Date - 2021-12-17T17:20:23+05:30 IST

ఎన్జీటీలో ఏపీ ప్రభుత్వానికి షాక్‌ తగిలింది.

ఎన్జీటీలో AP ప్రభుత్వానికి షాక్‌

న్యూఢిల్లీ: ఎన్జీటీలో ఏపీ ప్రభుత్వానికి షాక్‌ తగిలింది.  రాయలసీమ ఎత్తిపోతల పథకంపై శుక్రవారం ఎన్జీటీ తీర్పును వెల్లడించింది. కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టరాదని ఎన్జీటీ స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో అధ్యయనానికి నిపుణుల కమిటీని ఎన్జీటీ ఏర్పాటు చేసింది. నాలుగు నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఏపీ సీఎస్‌పై కోర్టు ధిక్కారం చర్యలు అవసరం లేదని పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణం చేపడితే ఏపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎన్జీటీ స్పష్టం చేసింది.

Updated Date - 2021-12-17T17:20:23+05:30 IST