పురుషోత్తపట్నం తీర్పును సమీక్షించం: ఎన్‌జీటీ

ABN , First Publish Date - 2020-12-03T09:02:08+05:30 IST

పురుషోత్తపట్నం తీర్పును సమీక్షించం: ఎన్‌జీటీ

పురుషోత్తపట్నం తీర్పును సమీక్షించం: ఎన్‌జీటీ

న్యూఢిల్లీ, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): పురుషోత్తమపట్నం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తీసుకోవలసిందేనని ఇచ్చిన తీర్పును సమీక్షించడానికి జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) నిరాకరించింది. పురుషోత్తమపట్నం సాగునీటి ప్రాజెక్టు కాదని.. ఈ కోణంలో పునర్విచారణ జరపాలని.. గత సెప్టెంబరులో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిని ట్రైబ్యునల్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఏకే గోయల్‌, న్యాయ సభ్యుడు ఎస్పీ వాంగ్డీ, సభ్య నిపుణుడు నాగిన్‌ నందాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇటీవల కొట్టివేసింది. ఆ నిర్ణయం ప్రతిని బుధవారం తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది.

Updated Date - 2020-12-03T09:02:08+05:30 IST