ఆవిర్భావం.. ఖుషీగా గులాబీ
ABN , First Publish Date - 2022-04-28T12:04:15+05:30 IST
టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బుధవారం గ్రేటర్లో ఘనంగా జరిగాయి...
హైదరాబాద్ సిటీ : టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బుధవారం గ్రేటర్లో ఘనంగా జరిగాయి. డివిజన్ల వారీగా బస్తీలు, కాలనీల్లో నేతలు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ పాటలు, డప్పు దరువుల మధ్య నృత్యాలు చేసి ఆనందం వ్యక్తం చేశారు. దేశ్ కి నేత కేసీఆర్ అంటు నినాదాలు చేశారు. ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో నగరం గులాబీమయంగా మారింది.