వంటమాస్టర్‌తో మహిళకు వివాహేతర సంబంధం.. ఏమైందో కానీ ఒక్కసారిగా..!

ABN , First Publish Date - 2022-05-24T18:16:17+05:30 IST

వంటమాస్టర్‌తో మహిళకు వివాహేతర సంబంధం.. ఏమైందో కానీ ఒక్కసారిగా..!

వంటమాస్టర్‌తో మహిళకు వివాహేతర సంబంధం.. ఏమైందో కానీ ఒక్కసారిగా..!

  • ఎల్లమ్మబండలో మహిళ హత్య
  • శవాన్ని గదిలో పెట్టి పరారైన నిందితుడు
  • నాలుగు రోజుల తర్వాత వెలుగులోకి..

హైదరాబాద్ సిటీ/జీడిమెట్ల : ఎల్లమ్మబండ దత్తాత్రేయ కాలనీలో ఓ మహిళ (Women) దారుణ హత్యకు గురైంది. ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తే నాలుగు రోజుల క్రితం ఆమెను హత్య చేసి పరారైనట్లు పోలీసులు (Police) భావిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా, మనుబోలు మండలం, కట్టువపల్లి గ్రామానికి చెందిన పెంచలయ్య కుమారుడు గోని ప్రసాద్‌ (35) వంట మాస్టర్‌. ఆరు నెలల క్రితం ఎల్లమ్మబండ దత్తాత్రేనగర్‌లో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. అతడి గదికి ఓ మహిళ వారానికి ఒకసారి వచ్చి పోతుండేది.


ఏమైందో కానీ ప్రసాద్‌ బెడ్‌పైనే ఆమె తల పగలగొట్టి హత్య చేసి పరారయ్యాడు. నాలుగు రోజుల అనంతరం ఆ గదికి సమీపంలో ఉన్న కిరాణా దుకాణం యజమానికి ఓ ఫోన్‌ వచ్చింది. ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి హత్య విషయం చెప్పాడు. కాలనీ అధ్యక్షుడు డయల్‌ 100కు ఫోన్‌ చేయడంతో జగద్గిరిగుట్ట సీఐ సైదులు గది తలుపులు పగలగొట్టారు. లోపల రక్తపు మడుగులో దుర్వాసన వస్తున్న మహిళ శవాన్ని గుర్తించారు. హత్యోదంతం వెలుగులోకి రావడంతో స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడారు. నాలుగు రోజులుగా తమ ఇంటి పక్కనే శవం ఉందని తెలిసి స్థానిక మహిళలు ఆందోళనకు గురయ్యారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-05-24T18:16:17+05:30 IST