నాగోబాను దర్శించిన కలెక్టర్
ABN , First Publish Date - 2020-08-02T10:54:43+05:30 IST
నాగోబాను దర్శించిన కలెక్టర్
ఆగస్టు 1: జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సిక్తా పట్నాయక్ ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో ఉన్న మెస్రం గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబాను శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నాగోబా ఆలయ చరిత్ర గురించి మెస్రం పెద్దలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సర్పంచ్ రేణుక నాగ్నాథ్, కలెక్టర్కు నాగోబా చిత్రపటం అందించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పుష్పలత, నాగోబా ఆలయ కమిటీ పీఠాధిపతి మెస్రం వెంకట్రావు, ఎంపీడీవో రమాకాంత్, తహసీల్దార్ రాఘవేందర్రావు, తదితరులు పాల్గొన్నారు.