వ్యాపార సంస్థల పని వేళల్లో మార్పు

ABN , First Publish Date - 2020-08-02T10:55:18+05:30 IST

వ్యాపార సంస్థల పని వేళల్లో మార్పు

వ్యాపార సంస్థల పని వేళల్లో మార్పు

ఉట్నూర్‌ రూరల్‌, ఆగస్టు 1: కరోనా వైరస్‌ నియంత్రణ కోసం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని వర్తక వ్యాపార యజమానులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దుకాణాల  పనివేళలను మార్పు చేశారు. శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్‌ గాంధారి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. వినియోగదారుల, వ్యాపారుల ఆరోగ్య క్షేమం కోసం దుకాణాల పనివేళలు మార్చినట్లు తీర్మానించారు. ప్రతీ దుకాణం ఉదయం 8గంటలకు తెరచి మధ్యాహ్నం రెండు గంటలకు మూసివేయాలన్నారు. శనివారం నుంచి వచ్చేనెల ఒకటో తేదీ వరకు ఈ విధానం అమలు చేస్తామని నిర్ణయించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.2 వేలు జరిమానా విధించాలని నిర్ణయించారు. డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ మారుతి డోంగ్రే మాట్లాడుతూ ప్రజల బాగోగుల కోసం వ్యాపారులు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు.   సమావేశంలో ఉపసర్పంచ్‌ గణేష్‌, పంచాయతీ కార్యదర్శి ఆత్రం శంకర్‌, వ్యాపారు లు  చింతావార్‌ సంతోష్‌, లహానే సంజీవ్‌, దీపక్‌సింగ్‌ షేకావత్‌ ఉన్నారు.

Updated Date - 2020-08-02T10:55:18+05:30 IST