పెళ్లైన రెండున్నర నెలలకు భర్తకు షాకిచ్చిన నవ వధువు.. అన్నంలో నిద్రమాత్రలు కలిపి మరీ... ఆమె ఏం చేసిందంటే..
ABN , First Publish Date - 2022-01-20T22:10:21+05:30 IST
పెళ్లైన రెండున్నర నెలలకే భర్తకు నవ వధవు షాకిచ్చింది. నిద్రమాత్రలు కలిపిన ఆహారాన్ని ప్రేమతో వడ్డించి.. భర్తకు స్పృహ లేకుండా చేసింది. ఆ తర్వాత ఆమె చేసిన పనికి భర్త సహా అతడి కుటుంబ సభ్యు
ఇంటర్నెట్ డెస్క్: పెళ్లైన రెండున్నర నెలలకే భర్తకు నవ వధవు షాకిచ్చింది. నిద్రమాత్రలు కలిపిన ఆహారాన్ని ప్రేమతో వడ్డించి.. భర్తకు స్పృహ లేకుండా చేసింది. ఆ తర్వాత ఆమె చేసిన పనికి భర్త సహా అతడి కుటుంబ సభ్యులు అందరూ విస్తుపోయారు. షాక్ నుంచి తేరుకున్న తర్వాత పోలీసు స్టేషన్కు పరుగులు తీశారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
రాజస్థాన్లోని భరత్పూర్ ప్రాంతానికి చెందిన భగవాన్ సింగ్.. కొన్ని సంవత్సరాలుగా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాడు. అతడి వయసు 35ఏళ్లు కావడంతో అమ్మాయిని ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఇక తనకు పెళ్లి కాదని ఫిక్సైన తరుణంలో.. ధోల్పూర్ ప్రాంతానికి చెందిన నీలమ్ను చూసి ఇష్టపడ్డాడు. ఈ క్రమంలో ఎదురుకట్నంగా రూ. 10లక్షలు ఇచ్చి మరీ.. నీలమ్ను పెళ్లి చేసుకునేందుకు భగవాన్ సింగ్ సిద్ధపడ్డాడు. నవంబర్ మొదటి వారంలో వారిద్దరి వివాహం జరిగింది కూడా. అయితే, పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగుపెట్టిన నీలమ్.. అక్కడ అందరితో చక్కగా కలిసిపోయింది. ప్రేమగా మాట్లాడుతూ.. ఇల్లంతా సందడి చేసింది.
అంతా బాగానే ఉందని భావిస్తోన్న సమయంలో నీలమ్ చేసిన పనికి భగవాన్ సింగ్ సహా అతడి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బుధవారం రాత్రి నిద్రమాత్రలు కలిపిన ఆహారాన్ని భర్తకు వడ్డించిన నీలమ్.. అతడు స్పృహ కోల్పోగానే ఇంట్లో ఉన్న డబ్బు, నగలను తీసుకుని పారిపోయింది. ఉదయం లేచే సరికి నీలమ్ ఇంట్లో కనబడకపోవడంతో తొలుత కంగారుపడ్డ భగవాన్ సింగ్.. ఆ తర్వాత నీలమ్ తనను మోసం చేసిందని గ్రహించాడు. అంతేకాకుండా పోలీసు స్టేషన్కు వెళ్లి భార్య సహా ఆమె కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు.. నీలమ్ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.