ఏపీలో కొత్తగా 396 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-10-23T22:16:18+05:30 IST
రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై అధికారులు
అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై అధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేసారు. ఏపీలో కొత్తగా 396 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనాతో ఆరుగురు మృతి చెందారు. ఇప్పటివరకు ఏపీలో మొత్తం 20,63,177 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో మొత్తం 14,339 మంది మరణించారు. ఏపీలో 5,222 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 20,43,616 మంది రికవరీ చెందారు.