కొత్తగా 39 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-10-18T06:12:38+05:30 IST
జిల్లాలో మరో 39 మందికి కరోనా వైరస్ సోకినట్టు ఆదివారం నిర్ధారణ అయింది.
విశాఖపట్నం, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మరో 39 మందికి కరోనా వైరస్ సోకినట్టు ఆదివారం నిర్ధారణ అయింది. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,57,810కు చేరింది. ఇందులో 1,55,879 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కొవిడ్తో 1093 మంది మృతి చెందారు.