భారత్‌లో కొత్తగా 3205 కొవిడ్ కేసులు, 31 మరణాలు

ABN , First Publish Date - 2022-05-04T15:27:34+05:30 IST

దేశంలో కొవిడ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 3205 పాజిటివ్ కేసులు, 31 మరణాలు నమోదు అయ్యాయి.

భారత్‌లో కొత్తగా 3205 కొవిడ్ కేసులు, 31 మరణాలు

న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 3205 పాజిటివ్ కేసులు, 31 మరణాలు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో 19,509 యక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే యాక్టివ్ కేసులు 0.05 శాతంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4,30,88,118 కేసులు అవగా...  5,23,920 మరణాలు సంభవించాయి. దేశంలో కరోన రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. నిన్న  2802 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,25,44,689గా ఉంది. 

Read more