అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై అధికారులు బులెటిన్ విడుదల చేశారు. ఏపీలో కొత్తగా 132 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకు ఏపీలో మొత్తం 20,75,108 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో మొత్తం 14,468 మరణాలు సంభివించాయి. ఏపీలో 1,823 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 20,58,817 మంది రికవరీ చెందారు.