ఏపీలో కొత్తగా 12,561 కరోనా పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2022-01-29T00:30:30+05:30 IST
రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలోని
అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారుల హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఏపీలో కొత్తగా 12,561 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో 12 మంది మృతి చెందారు. ఏపీలో మొత్తం 22,58,608 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనాతో 14,591 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో 1,13,300 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 21,20,717 మంది రికవరీ చెందారు.