అనంతపురం వైద్యం, డిసెంబరు 4: జిల్లాలో శనివారం కొత్తగా 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరణాలు సంభవించలేదు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 158074 మంది కరోనా బారిన ప డ్డారు. ఇందులో 156907 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. 1093 మంది మరణించగా, ఇంకా 74 మంది బాధితులు చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.