పెళ్లైన రెండు రోజులకు దారుణానికి పాల్పడ్డ నవవధువు.. విషం కలిపిన భోజనాన్ని భర్త సహా అతడి కుటుంబ సభ్యులకు వడ్డించి..

ABN , First Publish Date - 2022-02-27T21:14:42+05:30 IST

పెళ్లైన రెండు రోజులకు నవవధువు దారుణానికి పాల్పడింది. భర్త సహా అత్తింటి వారిపై ప్రేమను నటిస్తూ విషం కలిపిన భోజనాన్ని వడ్డించింది. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్న ఘ

పెళ్లైన రెండు రోజులకు దారుణానికి పాల్పడ్డ నవవధువు.. విషం కలిపిన భోజనాన్ని భర్త సహా అతడి కుటుంబ సభ్యులకు వడ్డించి..

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లైన రెండు రోజులకు నవవధువు దారుణానికి పాల్పడింది. భర్త సహా అత్తింటి వారిపై ప్రేమను నటిస్తూ విషం కలిపిన భోజనాన్ని వడ్డించింది. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్న ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. స్థానికంగా చర్చనీయాంశం అయిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 



జైపూర్‌లోని కోట్‌పుట్లీ ప్రాంతానికి చెందిన నందు పట్వాకు కొద్ది రోజుల క్రితం పూజా రాజి అనే యువతితో పెళ్లి అయింది. అయితే, పెళ్లైన రెండు రోజులకే ఆ నవవధువు దారుణానికి పాల్పడింది. వరుడి కుటుంబ సభ్యులతో కలివిడిగా ఉంటూనే భారీ స్కెచ్ వేసింది. భర్త సహా అతడి కుటుంబ సభ్యులకు విషం కలిపిన భోజనాన్ని వడ్డించింది. ఆ భోజనం తిని అందరూ స్పృహ కోల్పోగానే ఇంట్లో ఉన్న నగలు, డబ్బుతో ఇంట్లోంచి పారిపోయింది. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ప్రాణాపాయం జరగలేదు. నందు పట్వా కుటుంబ సభ్యులంతా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా.. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు నందు పట్వాను సంప్రదించారు. అతడు చెప్పిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.




Updated Date - 2022-02-27T21:14:42+05:30 IST