కరోనా కలకలం: ఒక్క కరోనా కేసు.. దేశవ్యాప్తంగా లాక్డౌన్!
ABN , First Publish Date - 2021-08-18T04:48:08+05:30 IST
ఒకే ఒక్క కరోనా కేసు వెలుగులోకి వచ్చింది...అంతే ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. ఎక్కడా అని ఆశ్చర్యపోతున్నారా...? కరోనా విషయంలో ఇంతటి జాగ్రత్తలు తీసుకుంటున్న దేశం న్యూజీల్యాండ్.
వెల్లింగ్టన్: ఒకే ఒక్క కరోనా కేసు వెలుగులోకి వచ్చింది...అంతే ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. ఎక్కడా అని ఆశ్చర్యపోతున్నారా...? కరోనా విషయంలో ఇంతటి జాగ్రత్తలు తీసుకుంటున్న దేశం న్యూజీల్యాండ్. మంగళవారం అక్కడ దేశవ్యాప్త లాక్ డౌన్ మొదలైంది. కనీసం మూడు రోజుల పాటు ఇది కొనసాగనుంది. ఆ తరువాత పరిస్థితిని అనుసరించి లాక్ డౌన్ కొనసాగించాలా వాద్ద అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ‘‘దీన్ని తొలిదశలోనే అదుపు చేయలేకపోతే ఏం జరుగుతుందో మనం చూశాం’’ అని న్యూజీల్యాండ్ ప్రధాని జసిండా ఆర్డన్ వ్యాఖ్యానించారు. ఆక్ల్యాండ్లో ఈ కరోనా కేసు బయటపడింది.