ఐపీఎల్‌కు కివీస్‌ ఆటగాళ్లు దూరం!

ABN , First Publish Date - 2021-05-13T05:58:30+05:30 IST

రీషెడ్యూల్డ్‌ ఐపీఎల్‌కు న్యూజిలాండ్‌ ఆటగాళ్లు కూడా దూరం కానున్నారని తెలుస్తోంది. సెప్టెంబరులో యూఏఈలో పాకిస్థాన్‌తో కివీస్‌ 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌లు ఆడనుంది...

ఐపీఎల్‌కు కివీస్‌ ఆటగాళ్లు దూరం!

న్యూఢిల్లీ: రీషెడ్యూల్డ్‌ ఐపీఎల్‌కు న్యూజిలాండ్‌ ఆటగాళ్లు కూడా దూరం కానున్నారని తెలుస్తోంది. సెప్టెంబరులో యూఏఈలో పాకిస్థాన్‌తో కివీస్‌ 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌లు ఆడనుంది. కాగా, వాయిదా పడిన ఐపీఎల్‌ను అదే సమయంలో నిర్వహిస్తారని భావిస్తున్నారు. అదే జరిగితే,  కెప్టెన్‌ విలియమ్సన్‌ సహా కివీస్‌ ఆటగాళ్లు లీగ్‌లో ఆడక పోవచ్చు. ఇప్పటికే ఇంగ్లండ్‌ ఆటగాళ్లు ఐపీఎల్‌కు అందుబాటులో ఉండరని ఈసీబీ పేర్కొన్న విషయం విదితమే. 


Updated Date - 2021-05-13T05:58:30+05:30 IST