ఆన్లైన్లో చూసి ముచ్చటపడింది.. ముందూ వెనక ఆలోచించకుండా ఆర్డర్ పెట్టేసింది.. చివరకు..
ABN , First Publish Date - 2022-02-03T01:41:41+05:30 IST
ఆన్లైన్లో కుర్చీని చూసి ఓ మహిళ ముచ్చటపడింది. ముందూ వెనక ఆలోచించకుండా.. ఎంతో ఇష్టపడి ఆర్డర్ పెట్టేసింది. ఈ క్రమంలోనే డెలివరీ అయిన దాన్ని చూసి.. ఆమె కంగుతింది. అంతేకాకుండా తన
న్యూయార్క్: ఆన్లైన్లో కుర్చీని చూసి ఓ మహిళ ముచ్చటపడింది. ముందూ వెనక ఆలోచించకుండా.. ఎంతో ఇష్టపడి ఆర్డర్ పెట్టేసింది. ఈ క్రమంలోనే డెలివరీ అయిన దాన్ని చూసి.. ఆమె కంగుతింది. అంతేకాకుండా తనకు ఎదురైన అనుభవాన్ని నెటిజన్లతో పంచుకుంది. దీంతో నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
న్యూయార్క్కు చెందిన మరియం అనే మహిళ ఖాళీ సమయంలో ఫోన్లో బ్రౌజ్ చేస్తూ కూర్చుంది. సరిగ్గా అదే సమయంలో ఫోన్లో కనిపించిన ఓ ప్రకటన ఆమెను ఆకట్టుకుంది. నీలి రంగులో ఉన్న వెల్వెట్ కుర్చీని చూసి ముచ్చటపడింది. వెంటనే ఆర్డర్ పెట్టేసింది. ఈ క్రమంలోనే డెలివరీ అయిన కుర్చీని చూసి కంగుతింది. బొమ్మ కుర్చీని చూసి విస్తుపోయిన ఆమె.. తనకు ఎదురైన అనుభవాన్ని నెటిజన్లతో పంచుకుంది. ‘ఇంట్లో వాడుకోవడానికి కుర్చీని ఆర్డర్ చేస్తే.. బొమ్మ కుర్చీ వచ్చింది. దీన్ని రిటర్న చేసి డబ్బులు తీసుకునే ఆప్షన్ కూడా లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక వస్తువును ఆన్లైన్లో ఆర్డర్ చేసేపుడు.. దానికి సంబంధించిన వివరాలతో పాటు రివ్యూలను పరిశీలించరా? అంటూ కామెంట్ చేస్తున్నారు.