న్యూ ఇయర్కు పబ్లు, క్లబ్లలో 50 శాతానికి ఓకే
ABN , First Publish Date - 2021-12-25T17:52:57+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ ప్రభావం పెరుగుతున్న తరుణంలో ఆంక్షలు విధించాలని భావిస్తున్న రాష్ట్రప్రభుత్వం కొత్తసంవత్సర వేడుకలకు కొంతమేర వెసులుబాటు కల్పించింది. న్యూ ఇయర్కు పబ్లు, క్లబ్లు, హోటళ్లలో 50 శాతం
బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్ ప్రభావం పెరుగుతున్న తరుణంలో ఆంక్షలు విధించాలని భావిస్తున్న రాష్ట్రప్రభుత్వం కొత్తసంవత్సర వేడుకలకు కొంతమేర వెసులుబాటు కల్పించింది. న్యూ ఇయర్కు పబ్లు, క్లబ్లు, హోటళ్లలో 50 శాతం మందికి అన్వయించేలా ఏర్పాట్లకు ఓకే చెప్పింది. శుక్రవారం శాసనసభ సమావేశాలు ముగిశాక బెళగావి సువర్ణసౌధలో సీఎం బసవరాజ్ బొమ్మై మీడియాతో మాట్లాడారు. 50:50 పద్ధతిన వ్యాపారాలకు వెసలుబాటు ఇచ్చామన్నారు. ఈ విషయంలో పోలీసులు ఎటువంటి గందరగోళం చేయరన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో మరిన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోనుందని అందుకు అనుగుణంగానే రాష్ట్రంలోనూ అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఒమైక్రాన్ కేసులు పెరిగాయన్నారు. గురువారం ఒకేరోజున 12మందికి ప్రబలిందని ప్రస్తుతానికి 31మంది బాధితులయ్యారన్నారు. దేశవ్యాప్తంగా ఒమైక్రాన్ కేసులు పెరుగుతున్న తరుణంలో కేంద్రప్రభుత్వం పలు మార్గదర్శకాలు చేసిందని వాటిని అ మలు చేసేందుకు కట్టుబడతామన్నారు.