మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌కు నూతన కార్యవర్గం

ABN , First Publish Date - 2021-04-17T07:01:53+05:30 IST

ఏపీ మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర నూతన కార్యవర్గ ఎన్నికలు శుక్రవారం తిరుపతిలో జరిగాయి.

మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌కు నూతన కార్యవర్గం
బాలయ్య - గిరిబాబు - సాయి సత్యనారాయణ

తిరుపతి(ఆటోనగర్‌), ఏప్రిల్‌ 16: ఏపీ మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర నూతన కార్యవర్గ ఎన్నికలు శుక్రవారం తిరుపతిలో జరిగాయి. గౌరవ అధ్యక్షుడిగా జి.ఓబులేసు, అధ్యక్షుడిగా వడ్డె బాలయ్య, ప్రధాన కార్యదర్శిగా ఎ.గిరిబాబు, కోశాధికారిగా వి.సాయి సత్యనారాయణ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఎం.బాలరాజునాయుడు, ఉపాధ్యక్షులుగా కోన అప్పారావు, బి.లక్ష్మణమూర్తి, కొడాలి శేషయ్య, డిప్యూటీ జనరల్‌ సెక్రటరీలుగా  పి.అప్పారావు, బి.స్వామిబాబు, కార్యదర్శులుగా జి.అబ్రహాం, కె.చిన్నయ్య, సలహాదారులుగా పి.సూర్యవతి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధ్యక్షుడు ప్రకటించారు. 

Updated Date - 2021-04-17T07:01:53+05:30 IST