హేమంత్ హత్య కేసులో కొత్త ట్విస్ట్

ABN , First Publish Date - 2020-09-25T23:02:39+05:30 IST

హేమంత్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. కిరాయి గుండాలతో హేమంత్‌ను మేనమామ యుగంధర్ రెడ్డి హత్య చేయించాడు.

హేమంత్ హత్య కేసులో కొత్త ట్విస్ట్

హైదరాబాద్: హేమంత్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. కిరాయి గుండాలతో హేమంత్‌ను మేనమామ యుగంధర్ రెడ్డి హత్య చేయించాడు. హేమంత్ హత్య కోసం యుగంధర్ రూ.10 లక్షలు ఇచ్చాడు. చందానగర్‌కు చెందిన ఇద్దరు కిరాయి గుండాలతో హత్య చేయించాడు. యుగంధర్‌తో పాటు 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. హేమంత్ హత్య కేసులో 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు లక్ష్మారెడ్డి, యుగంధర్ రెడ్డి, రాకేష్ రెడ్డి, రంజిత్ రెడ్డి, విజేందర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, స్పందన, స్వప్న, రజిత, అర్చనలపై కేసులు నమోదు చేశారు. ప్రేమ వివాహం ఇష్టం లేని అవంతిక తండ్రి కొంతమంది వ్యక్తులకు సుపారీ ఇచ్చి హత్య చేయించారన్నదాంట్లో ఎలాంటి వాస్తవం లేదని పోలీసులు తేల్చారు. హేమంత్ హత్యలో అవంతిక కుటుంబసభ్యులే కీలక పాత్ర పోషించారని వెల్లడించారు.

Updated Date - 2020-09-25T23:02:39+05:30 IST