పోరాటాలు ఉధృతం చేయాలి
ABN , First Publish Date - 2022-05-20T05:50:00+05:30 IST
పుచ్చపల్లి సుందరయ్య స్ఫూర్తితో శ్రామిక, రైతు పోరాటాలను ఉధృతం చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డాక్టర్ కే హేమలత పిలుపునిచ్చారు.
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు హేమలత
ఒంగోలు(కలెక్టరేట్), మే 19 : పుచ్చపల్లి సుందరయ్య స్ఫూర్తితో శ్రామిక, రైతు పోరాటాలను ఉధృతం చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డాక్టర్ కే హేమలత పిలుపునిచ్చారు. స్థానిక సుందరయ్య భవన్లో గురువారం పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సభ జరిగింది. ఈ సందర్భంగా సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జీవీ కొండారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో హేమలత మాట్లాడుతూ వివిధ తరగతుల ప్రజలు కష్టాల్లో చిక్కుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ధరలు, పన్నుల మోతతో ప్రజలకు పెనుభారంగా మారిందన్నారు. విచ్చలవిడిగా ప్రైవేటీకరణతో దేశ ఆర్థిక వ్యవస్థ దివాళా తీసిందన్నారు. కార్యక్రమంలో సీపీఎం తూర్పు ప్రకాశం కార్యదర్శి పూనాటి ఆంజనేయులు, కే ఉమామహేశ్వరరావు, కే సుబ్బరావమ్మ, వై.సిద్దయ్య, జాలా అంజయ్య, కంకణాల ఆంజనేయులు, చీకటి శ్రీనివాసరావు, షేక్ మాబు, రఘరాం, రమాదేవి, పీ కల్పన, షేక్ అమీర్ పాల్గొన్నారు.