ల్యాండ్‌లైన్ టు మొబైల్స్... నో కాల్స్!

ABN , First Publish Date - 2021-01-15T17:31:22+05:30 IST

దేశవ్యాప్తంగా ఉన్న ల్యాండ్‌లైన్ వినియోగదారులంతా ఈరోజు అంటే...

ల్యాండ్‌లైన్ టు మొబైల్స్... నో కాల్స్!

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న ల్యాండ్‌లైన్ వినియోగదారులంతా ఈరోజు అంటే జనవరి 15 నుంచి వారి ల్యాండ్‌లైన్ నుంచి ఏ మొబైల్ నంబరుకు ఫోన్ చేయాలన్నా ముందుగా ‘సున్నా’ నొక్కాల్సివుంటుంది. డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్(డాట్) గత నవంబరులో ల్యాండ్ లైన్ వినియోగదారులు ఏ మొబైల్ నంబరుకు ఫోను చేయాలన్నా ముందుగా సున్నా నంబరు నొక్కాలని తెలిపింది. ఈ విధానం ఈరోజు నుంచి అమలులోకి వచ్చింది. టెలికం ఆపరేటర్స్ తమ వినియోగదారులకు ఈ సమాచారాన్ని తెలియజేసేందుకు అన్నిఏర్పాట్లు చేశాయి. 


ఎయిర్‌టెల్ తన ఫిక్స్‌డ్ లైన్ యూజర్స్‌కు ఈ విషయాన్ని తెలియజేస్తూ... డాట్ ఆదేశాలను అనుసరించి 2021, జనవరి 15 నుంచి ఏ ల్యాండ్‌లైన్ నుంచి అయినా మొబైల్‌కు పోన్ చేయాలంటే ముందుగా జీరో ప్రెస్ చేయడం తప్పనిసరి అని తెలిపింది. ఇదేవిధంగా జియో కూడా తన ఫిక్స్‌డ్ ల్యాండ్ లైన్ యూ‌జర్స్‌కు దీనికి సంబంధించిన మెసేజ్ పంపించింది. కాగా ఈ విధానం కేవలం ల్యాండ్ లైన్‌లకు మాత్రమే వర్తిస్తుంది. మొబైల్ నుంచి ల్యాండ్‌లైన్‌కు ఫోన్ చేయాల్సివచ్చిన్పుడు ఈ విధానం అనుసరించాల్సిన అవసరం లేదు. డాట్ తెలిపిన వివరాల ప్రకారం ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్‌కు కాల్ చేసేందుకు తీసుకువచ్చిన ఈ విధానం వలన మొబైల్ సర్వీసెస్ కోసం టెలికం కంపెనీలకు వీలైనంత అత్యధిక నంబర్లు రూపొందించేందుకు అవకాశం ఏర్పడుతుంది. 

Updated Date - 2021-01-15T17:31:22+05:30 IST