‘కొత్త రేషన్‌కార్డులు జారీ చేయాలి’

ABN , First Publish Date - 2020-06-02T10:06:48+05:30 IST

దరఖాస్తు చేసుకున్న వారందరికీ కొత్త రేషన్‌కార్డులు జారీచేయాలని సివిల్‌ సప్లై సీఆర్‌వో సత్యనారాయణకు

‘కొత్త రేషన్‌కార్డులు జారీ చేయాలి’

రాంనగర్‌/బేగంపేట్‌/అబ్దుల్లాపూర్‌మెట్‌, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): దరఖాస్తు చేసుకున్న వారందరికీ కొత్త రేషన్‌కార్డులు జారీచేయాలని సివిల్‌ సప్లై సీఆర్‌వో సత్యనారాయణకు సీపీఎం నగర కమిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ప్రతినిధులు వినతిపత్రం ఇచ్చారు. ముషీరాబాద్‌, అంబర్‌పేట నియోజకవర్గాల్లో రేషన్‌కార్డులు మంజూరు చేయాలని సివిల్‌ సప్లై సర్కిల్‌-6 ఏఎ్‌సవో బాలరాజుకు సీపీఎం నగర కార్యవర్గ సభ్యుడు దశరథ్‌ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. సీపీఎం అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల కమిటీ కార్యదర్శి నర్సింహ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కిష్టయ్యకు వినతి పత్రం సమర్పించారు.

Updated Date - 2020-06-02T10:06:48+05:30 IST