గోల్కొండ సెల్ఫీ సూసైడ్ కేసులో కొత్త కోణం

ABN , First Publish Date - 2021-11-15T23:21:15+05:30 IST

నగరంలో సంచలనం సృష్టించిన గోల్కొండ సెల్ఫీ సూసైడ్ కేసులో కొత్త కోణం

గోల్కొండ సెల్ఫీ సూసైడ్ కేసులో కొత్త కోణం

హైదరాబాద్‌: నగరంలో సంచలనం సృష్టించిన గోల్కొండ సెల్ఫీ సూసైడ్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. మృతుడు సంతోష్ బ్రెయిన్‌ సంబంధిత వ్యాధితో భాదపడుతున్నట్లు సంతోష్‌ సతీమణి కల్యాణి  పోలీసులకు స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. సంతోష్‌ను తాను చంపాలనుకోలేదని తెలిపింది. సంతోష్ కుటుంబీకులు ముందుకు రాకపోతే తాను కౌన్సిలింగ్‌ ఇవ్వాలనుకున్నానని పేర్కొంది. తన భర్త మానసిక వ్యాధితో బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్నాడని వివరించింది. తన తండ్రి దివ్యాంగుడని, తన భర్తపై హత్యాయత్నం ఎలా చేయగలడని ఆమె ప్రశ్నించింది. తాను సంతోష్ నుంచి ఎలాంటి ఆస్తి కోరుకోలేదని భార్య కల్యాణి తెలిపింది.




గోల్కొండ పీఎస్ పరిధిలో భార్య వేధింపులు తట్టుకోలేక సంతోష్ అనే బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. సెల్ఫీ వీడియో తీసుకుని తన చావుకు కారణమైన వాళ్ల పేర్లను బయటపెట్టాడు. తనకు బతకాలనే కోరిక ఉన్నా తన భార్య వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. తను చెయ్యని తప్పులకు బజారుకీడ్చి పరువుతీసిందని సెల్ఫీ వీడియోలో వాపోయాడు. ఈ కేసులో సెల్ఫీ వీడియో సంచలనంగా మారింది. సెల్ఫీ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పాతబస్తీకి చెందిన కల్యాణి అనే యువతితో సంతోష్‌‌కు వివాహం జరిగింది. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరికి 6 ఏళ్ల బాబు ఉన్నాడు.

Updated Date - 2021-11-15T23:21:15+05:30 IST