తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తులకు కొత్త పాస్బుక్లు
ABN , First Publish Date - 2020-09-24T04:23:45+05:30 IST
రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు కలిగి ఉన్న ప్రజలకు కొత్త పాస్బుక్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్లో ..
హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు కలిగి ఉన్న ప్రజలకు కొత్త పాస్బుక్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు అంశాలపై ప్రగతి భవన్లో మంత్రులు, అధికారులతో బుధవారం సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్ కలర్ కొత్త పాస్ బుక్లు జారీ చేయనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. పైసా చెల్లించకుండా ప్రజలు ఎన్రోల్ చేయించుకోవాలని సూచించారు. ఇక భూమి బదిలీ అంశాలన్నీ ధరణి పోర్టల్ నుంచే నిర్వహణ జరుగుతుందన్నారు. నిరు పేదలుంటున్న ఇండ్ల స్థలాలను క్రమబద్ధీకరిస్తామన్నారు. బ్యాంకు రుణాలు తీసుకునేలా వీలు కల్పిస్తామని చెప్పారు. పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని ఈ సందర్భంగా ఎంపీవోలను సీఎం కేసీఆర్ ఆదేశించారు.