గుంజీలు తీస్తే ప్లాట్ఫాం టికెట్ ఉచితం
ABN , First Publish Date - 2020-02-22T08:02:21+05:30 IST
అది ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్లో అమర్చిన ఓ కియోస్క్ ముందు 3 నిమిషాల్లో 30 గుంజీలు తీసి ఉచితంగా ప్లాట్ఫాం టికెట్ పొందొచ్చు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 : అది ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్లో అమర్చిన ఓ కియోస్క్ ముందు 3 నిమిషాల్లో 30 గుంజీలు తీసి ఉచితంగా ప్లాట్ఫాం టికెట్ పొందొచ్చు. నిర్దేశించిన సమయంలో గుంజీలు తీయడం పూర్తవగానే మెషీన్ నుంచి టికెట్ బయటకు వస్తుంది. దీనికి ‘ఫిట్ ఇండియా స్క్వాట్ మెషీన్’ అని పేరు పెట్టారు. ఫిట్నెస్పై ప్రజల్లో అవగాహన కలిగించడానికి దీనిని ఏర్పాటు చేశారు.