New Jersey సాయి దత్త పీఠం బిపిన్ రావత్‌కు నివాళులు

ABN , First Publish Date - 2021-12-11T13:24:21+05:30 IST

హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్‌కు న్యూజెర్సీలోని సాయి దత్త పీఠం నివాళులు అర్పించింది.

New Jersey సాయి దత్త పీఠం బిపిన్ రావత్‌కు నివాళులు

న్యూజెర్సీ, ఎడిసన్: హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్‌కు న్యూజెర్సీలోని సాయి దత్త పీఠం నివాళులు అర్పించింది. న్యూజెర్సీలోని ఎడిసన్‌లో ఉన్న శ్రీ శివ, విష్ణు ఆలయంలో బిపిన్ రావత్ చిత్రపటం ముందు కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించింది. బిపిన్ రావత్‌తో పాటు సైన్యంలో సేవలందించిన కల్నల్ (రిటైర్డ్ ) వీరేంద్ర ఎస్ తవాతియా ఆయనతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వీర సైనికులకు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు. 


సాయి దత్త పీఠం నిర్వాహకులు రఘు శర్మ శంకరమంచి, న్యూజెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ చైర్మన్ ఉపేంద్ర చివుకుల, మాతా రాజ్యలక్ష్మి (స్పిరిట్యుయల్ గురు, కమ్యూనిటీ లీడర్), సాయి దత్త పీఠం బోర్డు సభ్యులు, ఆలయ భక్తులు, మాతృభూమి కోసం బిపిన్ రావత్ చేసిన సేవలను గుర్తు చేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్‌, వారి సతీమణి మధులికతో పాటు మిగిలిన సైనికులకు కూడా అందరూ నివాళులు అర్పించారు. బిపిన్ రావత్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు రఘు శర్మ శంకరమంచి తెలిపారు.




Updated Date - 2021-12-11T13:24:21+05:30 IST