నెగిటివ్ రిపోర్ట్ అప్‌లోడ్ చేసినా భారత్ వచ్చాక మళ్లీ టెస్ట్ చేయించుకోవాల్సిందే!

ABN , First Publish Date - 2021-02-25T13:17:06+05:30 IST

దేశంలో కరోనా కొత్త వేరియెంట్లు బయటపడటంతో విదేశీ ప్రయాణీకులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కొత్త మార్గదర్శకాల ప్రకారం విదేశాల నుంచి భారత్‌కు వచ్చే

నెగిటివ్ రిపోర్ట్ అప్‌లోడ్ చేసినా భారత్ వచ్చాక మళ్లీ టెస్ట్ చేయించుకోవాల్సిందే!

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త వేరియెంట్లు బయటపడటంతో విదేశీ ప్రయాణీకులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కొత్త మార్గదర్శకాల ప్రకారం విదేశాల నుంచి భారత్‌కు వచ్చే వారు ప్రయాణానికి మూడు రోజుల ముందుగా చేయించుకున్న కొవిడ్-19 రిపోర్ట్‌ను ఎయిర్ సువిదా పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. కొవిడ్-19 రిపోర్ట్‌లో నెగిటివ్ వస్తేనే భారత్‌కు వచ్చేందుకు అనుమతి ఉంటుంది. నెగిటివ్ రిపోర్ట్ అప్‌లోడ్ చేసినప్పటికి విదేశాల నుంచి వచ్చే ప్యాసెంజర్లు భారత్ వచ్చిన తర్వాత మళ్లీ కొవిడ్-19 టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. భారత్‌లోని వివిధ ఎయిర్‌పోర్ట్‌లలో వివిధ రకాలుగా కొవిడ్-19 టెస్ట్‌కు చార్జీలను వసూలు చేస్తున్నారు.


వివిధ రాష్ట్రాల్లోని ఎయిర్‌పోర్టులలో ఒక వ్యక్తికి కొవిడ్-19 టెస్ట్ రేట్ ఏ విధంగా ఉందంటే:

కేరళలోని కొచ్చి, తిరువనంతపురం ఎయిర్‌పోర్టులలో రూ. 1500 నుంచి రూ. 2 వేలు. 

ముంబాయి - రూ. 850, 

హైదరాబాద్ - రూ. వెయ్యి, 

అహ్మదాబాద్ - రూ. 800, 

బెంగళూరు - ఆర్టీపీసీఆర్ ఎక్స్‌ప్రెస్(రూ. 3 వేలు - 30 నిమిషాల ప్రాసెసింగ్ టైమ్), ఆర్టీపీసీఆర్ నార్మల్ - రూ. 500(నాలుగు గంటల ప్రాసెసింగ్ టైమ్), 

చెన్నై - రూ. 1200 నుంచి రూ. 2500, 

ఢిల్లీ - రూ. 800, 

కోల్‌కతా - రూ. 950


ఎయిర్ సువిదా పోర్టల్‌లో నెగిటివ్ రిపోర్ట్‌ను అప్‌లోడ్ చేసిన తర్వాత కూడా మరోమారు కొవిడ్-19 టెస్ట్ చేయడంపై ప్రవాసీయులు మండిపడుతున్నారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న భారతీయులు కేంద్ర నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కేరళకు చెందిన ప్రవాసీయులు కొవిడ్-19 టెస్ట్‌ను ఆపాలంటూ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు లేఖ రాశారు. తాము నెగిటివ్ రిపోర్ట్‌ అప్‌లోడ్ చేశాక మళ్లీ కొవిడ్-19 టెస్ట్ ఏంటంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో ఆర్థిక ఇబ్బందులను భరించలేక స్వదేశానికి వస్తోంటే, టెస్ట్‌ల పేరుతో తమ దగ్గర మళ్లీ డబ్బులను వసూలు చేయడం తగదంటూ ప్రవాసులు చెబుతున్నారు.

Updated Date - 2021-02-25T13:17:06+05:30 IST