తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికి నమోదైన కరోనా పాజిటివ్ కేసులివి..!
ABN , First Publish Date - 2020-03-27T03:46:12+05:30 IST
తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఏపీలో కొత్తగా మరో కరోనా...
హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఏపీలో కొత్తగా మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. మార్చి 18న స్వీడన్ నుంచి విజయవాడకు వచ్చిన 28 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్గా వైద్య పరీక్షల్లో వెల్లడైంది. దీంతో.. ఇప్పటికి ఏపీలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11కు చేరింది. తెలంగాణలో కూడా మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. సికింద్రాబాద్ బౌద్ధనగర్లో 45 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్గా వైద్యులు తేల్చారు.
ఇప్పటికి తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 45కి చేరింది. గురువారం ఒక్క రోజే తెలంగాణలో 4 పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా గురువారం నాటికి 694 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా మృతుల సంఖ్య 16కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 44 మంది కరోనా బాధితులు కోలుకున్నట్లు కేంద్రం వెల్లడించింది.