తెలంగాణలో కొత్తగా 3837 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-05-20T01:13:06+05:30 IST

గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 3837 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనాతో 25 మంది మృతి చెందారు.

తెలంగాణలో కొత్తగా 3837 కరోనా కేసులు

హైదరాబాద్: గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 3837 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనాతో 25 మంది మృతి చెందారు. కరోనా నుంచి 4,796 బాధితుల రికవరీ అయ్యారు. ప్రస్తుతం 46,946 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. కొవిడ్‌ రెండో దశ విజృంభిస్తున్న వేళ టెస్టులు పెంచాల్సి ఉండగా.. రాష్ట్రంలో మాత్రం తగ్గించారు. గతంలో రోజుకు లక్ష టెస్టులు చేయగా.. ఇప్పుడు 50 నుంచి 70 వేలే చేస్తున్నారు. ఇక ప్రభుత్వ కేంద్రాల్లో కొవిడ్‌ టెస్టులను తగ్గించడంతో ప్రజలు ప్రైవేటును ఆశ్రయిస్తున్నారు.

Updated Date - 2021-05-20T01:13:06+05:30 IST