త్వరలో కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి ఎన్నిక: సింఘ్వీ
ABN , First Publish Date - 2020-08-10T06:27:00+05:30 IST
కాంగ్రె్సకు త్వరలో పూర్తి స్థాయి అధ్యక్షుడిని ఎన్నుకుంటామని ఆ పార్టీ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ తెలిపారు. అప్పటి వరకు తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ కొనసాగుతారని స్పష్టం చేశారు...
న్యూఢిల్లీ, ఆగస్టు 9: కాంగ్రె్సకు త్వరలో పూర్తి స్థాయి అధ్యక్షుడిని ఎన్నుకుంటామని ఆ పార్టీ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ తెలిపారు. అప్పటి వరకు తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ కొనసాగుతారని స్పష్టం చేశారు. తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా ఈ నెల 10న ఏడాది కాలం పూర్తి చేసుకున్నంత మాత్రాన ఆ రోజు కాంగ్రెస్ అధ్యక్ష పీఠం ఖాళీ అయినట్లు కాదన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్టీకి పూర్తి స్థాయి అధ్యక్షుడిని ఓ పద్ధతి ప్రకారం ఎన్నుకుంటామని చెప్పారు.