డ్రోన్‌ దాడులతో అంతర్గత భద్రతకు కొత్త సవాళ్లు

ABN , First Publish Date - 2021-07-27T08:51:30+05:30 IST

డ్రోన్‌ దాడులు దేశ అంతర్గత భద్రతకు కొత్త సవాళ్లు విసురుతున్నాయని హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ అకాడమీ (నీసా) డైరెక్టర్‌ సీవీ ఆనంద్‌ అన్నారు.

డ్రోన్‌ దాడులతో అంతర్గత భద్రతకు కొత్త సవాళ్లు

నీసా డైరెక్టర్‌ సీవీ ఆనంద్‌

హైదరాబాద్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): డ్రోన్‌ దాడులు దేశ అంతర్గత భద్రతకు కొత్త సవాళ్లు విసురుతున్నాయని హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ అకాడమీ (నీసా) డైరెక్టర్‌ సీవీ ఆనంద్‌ అన్నారు. దేశంలో యాంటీ డ్రోన్‌ సాంకేతికతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ‘డ్రోన్‌ అప్లికేషన్లు-యాంటీ డ్రోన్‌ టెక్నాలజీస్‌’ అనే అంశంపై నీసాలో సోమవారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. యాంటీడ్రోన్‌ టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న 10కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-07-27T08:51:30+05:30 IST