డ్రోన్ దాడులతో అంతర్గత భద్రతకు కొత్త సవాళ్లు
ABN , First Publish Date - 2021-07-27T08:51:30+05:30 IST
డ్రోన్ దాడులు దేశ అంతర్గత భద్రతకు కొత్త సవాళ్లు విసురుతున్నాయని హైదరాబాద్లోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ (నీసా) డైరెక్టర్ సీవీ ఆనంద్ అన్నారు.
నీసా డైరెక్టర్ సీవీ ఆనంద్
హైదరాబాద్, జూలై 26 (ఆంధ్రజ్యోతి): డ్రోన్ దాడులు దేశ అంతర్గత భద్రతకు కొత్త సవాళ్లు విసురుతున్నాయని హైదరాబాద్లోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ (నీసా) డైరెక్టర్ సీవీ ఆనంద్ అన్నారు. దేశంలో యాంటీ డ్రోన్ సాంకేతికతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ‘డ్రోన్ అప్లికేషన్లు-యాంటీ డ్రోన్ టెక్నాలజీస్’ అనే అంశంపై నీసాలో సోమవారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. యాంటీడ్రోన్ టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న 10కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.